
ప్రముఖ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ది తాజ్ స్టోరీ సినిమా అనేక వివాదాల మధ్య థియేటర్లలో విడుదలైంది. షాజహాన్ నిజంగా తాజ్ మహల్ను నిర్మించాడా అనే చర్చను ఈ సినిమా ప్రస్తావించడంతో విడుదలకు ముందే ఇది పెద్ద చర్చకు దారితీసింది.
దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి రానుంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
ది తాజ్ స్టోరీ 2026 మార్చి 13 నుంచి లయన్స్ గెటెప్లే లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో పరేష్ రావల్, నమిత్ దాస్, జాకిర్ హుస్సేన్, శిశిర్ శర్మ, బ్రిజేన్ద్ర కాల, అమృత కాన్విల్కర్, స్నేహ వాఘ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని తుషార్ అమ్రిష్ గోయెల్ రచించి దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని సత్యజిత్ హాజర్నీస్ నిర్వహించగా, సంగీతాన్నిరోహిత్ శర్మమరియు రాహుల్ దేవ్ నాథ్ అందించారు. ఈ చిత్రాన్ని సి ఏ సురేష్ జా నిర్మించారు.
