ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 వరల్డ్ కప్ కోసం టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మను ప్రకటించింది.
ఈ 2026 టోర్నమెంట్ 7 ఫిబ్రవరి నుంచి 8 మార్చి వరకు భారతదేశం మరియు శ్రీలంకలో సంయుక్తంగా నిర్వహించబడుతుంది.

రోహిత్ శర్మ 2007 వ తొలి టీ20 వరల్డ్ కప్ నుంచి 2024 వరకూ అన్ని ఎడిషన్లలో పాల్గొన్న క్రికెటర్లలో ఒకరు. 2024లో భారత్ కి రెండో టీ20 వరల్డ్ కప్ జాతీయ గౌరవం తీసుకువచ్చినప్పుడు, రోహిత్ ఆ జట్టు కెప్టెన్గా ఉండి గెలుపుకి కీలక పాత్ర పోషించాడు.
ICC ప్రకారం, ఆయన T20 ఫార్మాట్లో ఉన్నంతకాలం వచ్చిన విజయాలు, అనుభవం, ప్రజాదరణ ఈ ambassadorship కి అర్హత చూపించాయి.
అంబాసిడర్ అయ్యాక, రోహిత్ తన సంహాసాన్ని సోషల్ మీడియా లో పంచుకుంటూ: “It is great to have the tournament back in India and for me to be associated once again with the tournament, this time in a new capacity as the Brand Ambassador.” అని అన్నారు.
ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు భారత క్రికెట్ కు మరియు అభిమానులకు గర్వకారణమైన విషయం.
2026 టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం కేవలం ఒక సెరిమొనియల్ గౌరవం కాదు.ప్లేయర్ కాలం ముగిసాక ఒక ambassadorship ద్వారా, క్రికెట్ ప్రపంచంలో తన విలువ తెలిపే ప్రయత్నం.
