శ్రీ కమల్ మరియు శివాని రాజశేఖర్ నటించిన జిలేబి 2023లో థియేటర్లలో విడుదలైంది. చాలా కాలం తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు OTT లోకి వస్తుంది.
జిలేబి 13 జూలై 2024న ఆహా వీడియోలో ప్రీమియర్ అవ్వబోతుంది. ఈ చిత్రంలో శ్రీ కమల్, శివాని రాజశేఖర్లతో పాటు అంకిత్ కొయ్య, సన్నీ, బమ్చిక్ బబ్లూ, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను తదితరులు నటించారు.
ప్రముఖ దర్శకుడు కె విజయ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించగా, సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రాన్ని ఎస్ఆర్కె ఆర్ట్స్, అంజు అస్రాని క్రియేషన్స్ బ్యానర్లపై రామకృష్ణ గుంటూరు, అంజు అస్రాని నిర్మించారు.
విజయ్ భాస్కర్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ లాంటి వాళ్ళు ఈ చిత్రానికి పనిచేసిన కూడా ఈ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. మరి ఈ సినిమా ఓట్ లో ఎలా ఆడుతుందో చూడాలి.