జయం రవి, నిత్యామీనన్ జంటగా నటించిన కాదలిక్క నేరమిళ్లై ఓటీటీ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంట్రెస్టింగ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఇప్పుడు, కాదలిక్క నేరమిల్లై 11 ఫిబ్రవరి 2025న నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేయబడుతుంది. ఈ సినిమా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ మరియు తెలుగు భాషలో కూడా విడుదల చేయబడుతుంది.
జయం రవి, నిత్యా మీనన్లతో పాటు యోగి బాబు, వినయ్ రాయ్, టీజే బాను, జాన్ కొక్కెన్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, సింగర్ మనో, వినోదిని, రోహన్ సింగ్ తదితరులు నటించారు.
కిరుతిగ ఉదయనిధి ఈ ప్రాజెక్ట్కి దర్శకత్వం వహించగా, గావెమిక్ ఆరీ కెమెరాను హ్యాండిల్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రెడ్ జెయింట్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాని నిర్మించారు.