‘కోర్ట్’ సినిమా భారీ విజయం తర్వాత హర్ష్ రోషన్ ‘టుక్ టుక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించినంత సందడి చేయలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమా OTTలోకి వస్తోంది, ఈటీవీ విన్లో ఏప్రిల్ 10, 2025న ప్రసారం కానుంది. హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి మరియు మరికొందరు ఈ సినిమా లో నటించారు.
సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంతు ఓంకార్ సంగీతం అందించారు, కార్తీక్ సాయికుమార్ కెమెరా హ్యాండిల్ చేయగా, చిత్రవాహిని ప్రొడక్షన్స్ మరియు RYG సినిమాస్ ఈ సినిమాను నిర్మించాయి.