ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా, కొద్దీ రోజుల్లో తెలుగు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయడానికి “వెండి పట్టిలు” అనే మరో చిత్రం సిద్ధమవుతోంది. ఈ మినీ చిత్రానికి సంబంధించిన టీజర్/ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది.
ఈ మినీ చిత్రం దాదాపు 35-40 నిమిషాల నిడివి ఉంటుంది. ఇందులో ఒక తండ్రి తన కూతురికి ఒక జత వెండి పట్టిలు కొనడానికి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 20, 2025న ఈటీవీ విన్ OTT ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
బాలాదిత్య, లతా రెడ్డి, బేబీ జైత్ర వరేణ్య, నరేంద్ర వర్మ మరియు నారాయణ స్వామి ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న రచయిత, నిర్మాత మరియు దర్శకుడు. దాము నర్రావుల కెమెరాను హ్యాండిల్ చేయగా, ఎస్కే బాలచంద్రన్ సంగీతం సమకూర్చారు మరియు మధు ఎడిటర్.