మలయాళంలో అద్భుతమైన స్పందన వచ్చిన మరో థ్రిల్లర్ ‘పెండులమ్’ ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది.
పెండులమ్ తెలుగు వెర్షన్ ఈటీవీ విన్లో 22 మే 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ బాబు, ఇంద్రన్స్, అనుమోల్, దేవకి రాజేంద్రన్, రమేష్ పిషారోడి, బినోజ్ విల్లియ, బిజు సోపానం, ప్రకాష్ బారె, షాజు శ్రీధర్ మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి రెజిన్ ఎస్. బాబు దర్శకత్వం వహించగా, జీన్ పి. జాన్సన్ సంగీతం సమకూర్చారు. అరుణ్ దామోదరన్ ఛాయాగ్రహణం వ్యవహరించగా, డానిష్ కె.ఎ., లిషా జోసెఫ్, బినోజ్ విల్లియ ఈ చిత్రాన్ని నిర్మించారు.