భూకంపం రూమర్లపై స్పందించిన దర్శకుడు మారుతి – ప్రభాస్ గురించి పెద్ద అప్‌డేట్

సోషల్ మీడియాలో భూకంపం, సునామీ హెచ్చరికల వార్తలు వచ్చిన తర్వాత ప్రభాస్ అభిమానుల్లో కొంత ఆందోళన కనిపించింది. ప్రత్యేకంగా, ప్రభాస్ ప్రస్తుత షూటింగ్ లొకేషన్ గురించిన రూమర్స్ వైరల్ కావడంతో, ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.

Maruthi Confirms Prabhas Safe Amid Viral Rumours

ఈ పరిస్థితిపై రియాక్ట్ అయిన ‘ది రాజా సాహెబ్’ సినిమా దర్శకుడు మారుతి స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ “ప్రభాస్ గారు పూర్తిగా సేఫ్‌గా ఉన్నారు. షూటింగ్ ఏ సమస్య లేకుండా మొత్తం టీం కొనసాగిస్తోంది. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు” అని చెప్పారు.

మారుతి మాటలతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌ని నమ్మొద్దని మారుతి రిక్వెస్ట్ చేశారు.

ప్రస్తుతం ‘ది రాజా సాహెబ్’ షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్‌కి చేరింది. త్వరలోనే సినిమా నుంచి కొత్త అప్‌డేట్స్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు:

ది రాజా సాహెబ్ – దర్శకుడు మారుతి
కల్కి 2898 AD రెండో భాగం
సలార్ పార్ట్ 2 – శూర్యవంశి
ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా

ఇలా ప్రభాస్ లేటెస్ట్ సినిమాలపై ఎక్కువ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ ఉంది. ఇలాంటి సమయం లో బాహుబలి ది ఎపిక్ రి-రిలీజ్ కోసమని జపాన్ కి వెళ్ళినపుడే భూకంపం వార్తలు రావడం తో కొంచెం కంగారు పడ్డారు ఫాన్స్. ఇపుడు ప్రభాస్ క్షేమంగా ఉన్నాడని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు