
నటుడు నందు ప్రధాన పాత్రలో నటించిన ‘సైక్ సిద్ధార్థ’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
థియేట్రికల్ రన్ అనంతరం ఇప్పుడు ‘సైక్ సిద్ధార్థ’ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 4న ఆహా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అవుతుంది.
నందుతో పాటు ఈ చిత్రంలో యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రిబెకా శ్రీనివాస్, సుకేష్, వడేకర్ నర్సింగ్, బాబీ రతకొండ, సాక్షి అత్రీ చతుర్వేది, మౌనిక, ప్రద్యుమ్న బిల్లూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి రచన, దర్శకత్వం వహించారు. సంగీతాన్ని స్మరణ్ సాయి అందించగా, సినిమాటోగ్రఫీని కె. ప్రకాశ్ రెడ్డి నిర్వహించారు. శ్రీ నందు మరియు శ్యామ్ సుందర్ రెడ్డి తూడి నిర్మాతలుగా వ్యవహరించారు.
థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం, ఓటీటీ వేదికపై అయినా అలరిస్తుందా లేదా చూడాలి.
