
శ్రీ విష్ణు అంటేనే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది, కానీ అప్పుడప్పుడు థ్రిల్లర్ సినిమాలు కూడా చేస్తుంటారు. అయితే రీసెంట్గ మృత్యుంజయ్ ఒక థ్రిల్లర్ సినిమాతో ముందుకొచ్చారు.
ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందనను పొందింది ఇక ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉంది. మృత్యుంజయ్ ఏప్రిల్ 3, 2026 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. శ్రీ విష్ణుతో పాటు ఈ చిత్రంలో రేబా మోనికా జాన్, సుధర్షన్, రచ్చ రవి, బేబీ ఊహా, ఐశ్వర్య, బాలాదిత్య, అయ్యప్ప, నంద గోపాల్, మృంచి మాధవి, సిజ్జు, కృష్ణ కౌశిక్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సంగీతాన్ని కాల భైరవ అందించగా, ఛాయాగ్రహణాన్ని విద్యా సాగర్ చింతా నిర్వహించారు. ఈ చిత్రాన్ని సందీప్ గున్నం మరియు వినయ్ చిలకపాటి నిర్మించారు.
