ఏపీ నుంచి ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2022 కు బహుమతుల ప్రదానోత్సవానికి గాను 128 మందికి పద్మ అవార్డులు లభించాయి. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.
వీరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సాహిత్యం, విద్య విభాగం నుంచి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుకు, కళలు విభాగం నుంచి గోసవీడు షేక్ హుస్సేన్ (మరణం తర్వాత)కు, మెడిసిన్ విభాగం నుంచి డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
గరికపాటి నరసింహారావు ఎవరు?
సాహిత్యం విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు చాలా తక్కువే అని చెప్పాలి. ఆయన ఉపన్యాసాల కోసం దేశ విదేశాల నుంచి అందరు ఎదురు చూస్తూ వుంటారు. గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో 1958 సెప్టెంబర్ 14వ తేదీన జన్మించారు. సుమారుగా 30 సంవత్సరాల పాటు ఉపాద్యాయుడిగా సేవలందించారు.
గోసవీడు షేక్ హుస్సేన్ ఎవరు?
గోసవీడు షేక్ హుస్సేన్ ప్రముఖ నాదస్వర కళాకారుడు. కళలకు సంబంధించి గోసవీడు షేక్ హుస్సేన్ కు పద్మ శ్రీ లభించింది. ఆంధ్ర ప్రదేశ్కు చెందిన గోసవీడు షేక్ హసన్ సాహెబ్, షేక్ చిన్న మౌలానా యొక్క పూర్వ శిష్యుడు, ఇతను సుమారు 45 సంవత్సరాలు బద్రాచారం సీతారామ దేవాలయంలో రెసిడెంట్ విద్వాన్గా పనిచేశాడు. ఆయనకు పద్మశ్రీ (మరణానంతరం) లభించింది. తిరువూరుకు చెందిన ప్రఖ్యాత నాదస్వరం విద్వాన్ షేక్ హసన్ సాహెబ్ 1930లో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించారు. చిలకలూరిపేటలోని చిన్న మౌలా సాహెబ్ వద్ద సంగీతంలో శిక్షణ పొందిన ఆయన బద్రాచలం, యాదగిరి గుట్ట ఆలయాల్లో నిలయం విద్వాన్గా పనిచేశారు. హైదరాబాద్లోని ఆకాశవాణిలో కూడా కార్యక్రమాలు చేశారు. చాలా మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇవ్వడంతో పాటు, అతను గత 67 సంవత్సరాలుగా తిరువూరులోని త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చాడు. ఆయనకు 2007లో త్యాగరాజ పురస్కార్ అవార్డు లభించింది. హసన్ సాహెబ్ 24 జూన్ 2021న మరణించారు.
సుంకర వెంకట ఆదినారాయణ రావు ఎవరు?
సుంకర వెంకట ఆదినారాయణరావు భారతీయ ఎముకల వైద్యులు. ఆయన పేదలకు సేవలందించే వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. వైద్యానికి సంబంధించి డా. సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ ప్రకటించారు.